‘ప్రభాస్ 21’ కు మెంటర్ గా సింగీతం శ్రీనివాసరావు

Film Director Singeetam Srinivasa Rao To Join Prabhas 21 Movie Team As A Mentor

నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా కోసం మరో లెజెండ్రీ డైరెక్టర్ కూడా పని చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు సింగీతం శ్రీనివాసరావు. ఈ విషయాన్ని ఈ సినిమాను నిర్మిస్తున్న వైజయంతి సంస్థ అధికారికంగా తెలిపింది. ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు మెంటర్ గా పని చేయనున్నారని.. ఈ సినిమాకు ఆయన క్రియేటివ్ సూపర్ పవర్స్ ఒక గైడ్ లో పనిచేస్తాయని తెలిపారు.

 

మరి సైంటిఫిక్…ఫిక్షన్…సాంఘికం.. పౌరాణికం..చారిత్రాత్మకం కథ ఏదైనా జానర్ ఇంకెదైనా ఆయన చేతిలో పడితే అందమైన కావ్యంగా మారిపోవాల్సిందే. అలాంటి సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు పనిచేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.

కాగా ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ప్రభాస్ 20 సినిమా. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − seven =