నటి, దర్శకురాలిగా, రచయితగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రేణూదేశాయ్. ప్రస్తుతం మెగా ఫోన్ పట్టి ఒక సినిమాను తెరకెక్కించే పనిలో పడింది. రైతు సమస్యలపై ఓ సినిమాను రూపొందిస్తున్నారు రేణు దేశాయ్. ఇప్పటికే ఈ సినిమా కోసం పలువురు రైతులను కలిశారు రేణు దేశాయ్. తాజాగా గోరటి వెంకన్నతో పాట కూడా రాయించుకున్నట్టు తెలిపింది. ఇక ఇదిలా ఉండగా అవకాశం వస్తే మళ్ళీ నటిస్తానని రేణుదేశాయ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్నేళ్ల తర్వాత కెమెరా ముందుకు రానున్నట్టు తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ విషయాన్ని తెలియచేస్తూ తన ఇన్స్టాలో ఒక పోస్ట్ చేస్తూ అందులో… మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నాను. ఓ అందమైన వెబ్ సిరీస్లో నటిస్తున్నాను.. చాలా హ్యాపీ గా అలాగే ఎగ్జయిటెడ్గా ఉన్నాను. వచ్చే నెల నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇంకా ఈ సిరీస్కు సంబంధించిన మరిన్ని వివరాలను కొద్ది రోజుల్లో తెలియజేస్తాను. ఈ సందర్భంగా మీ దీవెనలు, ప్రేమ అందిస్తారని కోరుతున్నాను అంటూ పేర్కొంది.
ఇక ఈ వెబ్ సిరీస్కు నిర్మాతలు డిఎస్. రావు, ఎస్. రజినీకాంత్. సాయి కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి దర్శకుడు ఎమ్.ఆర్. కృష్ణ మామిడాల. సినిమాటోగ్రఫీ దాశరథి శివేంద్ర..” అని రేణూ దేశాయ్ తన ఇన్స్టాగ్రమ్ పోస్ట్లో తెలిపింది.
కాగా పూరీ జగన్నాథ్ సినిమా బద్రితో తెలుగు తెరకు పరిచయమై.. ఇక అదే సినిమాలో హీరోగా నటించిన పవన్ ను ప్రేమించి పెళ్లాడిన హీరోయిన్ కమ్ డైరెక్టర్ రేణు దేశాయ్. కేవలం రెండు సినిమాల్లోనే నటించిన రేణు పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సినీ పరిశ్రమకు దూరమయ్యారు. అయితే కొన్నేళ్లు కలిసి ఉన్న వీరు ఆ తరువాత విడిపోయారు. ఇక మళ్లీ సినిమాలపై తన దృష్టి పెట్టారు. ఇప్పటికే ఒక సినిమాకు దర్శకత్వం కూడా వహించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: