ఆ సర్‌ప్రైజ్ లు మిస్ అవుతున్నా అంటున్న మంచు లక్ష్మీ

Actress Lakshmi Manchu Pens An Emotional Tweet Saying That She Is Missing Impromptu Lunch Surprises From Samantha Akkineni

లాక్ డౌన్ వల్ల మీటింగ్ లు చాటింగ్ లు పార్టీలు అంటూ సరదాగా గడిపే సెలబ్రిటీస్ కు ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ఎవరి ఇంట్లో వాళ్లే కాలక్షేపం చేస్తున్నారు. ఇక ఇప్పుడు అలాంటి సర్ ప్రయిజ్ లే మిస్ అవుతున్నా అంటుంది మంచు లక్ష్మీ. అసలు సంగతేంటంటే.. మన తెలుగు హీరోయిన్స్ తో, పలువురు సెలబ్రిటీస్ తో మంచు లక్ష్మీ చాలా సన్నిహితంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సమంత, ఉపాసన, శిల్పా రెడ్డి, రకుల్ మొదలైన వాళ్లతో మంచు లక్ష్మి తరచుగా టైమ్ స్పెండ్ చేస్తుంటుంది. వారిని కలవడం.. వారితో టైం స్పెండ్ చేయడం ఇలా జరుగుతూనే ఉంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా తన ఇన్స్టాలో ఒక ఫొటో పోస్ట్ చేసింది మంచు లక్ష్మీ. అందులో మంచు లక్ష్మీ.. కూతురు, ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి, సమంత ఉన్నారు. అయితే ఈ ఫొటో ఇప్పటిది కాదులే. పాత ఫొటో పోస్ట్ చేస్తూ.. `కొన్ని రోజుల క్రితం లంచ్ ప్లాన్‌తో సమంత, శిల్పారెడ్డి నన్ను సర్‌ప్రైజ్ చేశారు. అలాంటివాటిని మిస్ అవుతున్నా. మనం తరచుగా ఇలాంటి లంచ్‌లకు వెళ్లాల`ని మంచు లక్ష్మి కామెంట్ చేసింది. అలాగే తన రిఫ్రిజిరేటర్‌ను చిన్న చిన్న మొక్కలతో సమంత అద్భుతంగా డెకరేట్ చేసిందని మంచు లక్ష్మి పేర్కొంది.

 

బుల్లి తెరపై, వెండి తెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది మంచు వారసురాలు.. మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మీ. అంతేకాదు గత ఏడాది డిజిటల్ మీడియాలోకి కూడా అడుగుపెట్టారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =