మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆమని , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , ఈషా రెబ్బా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉండగా కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. 6 నెలల తరువాత ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని ఒక సెట్ లో పునః ప్రారంభం అయ్యింది. ఈ షూటింగ్ లో హీరో అఖిల్ , హీరోయిన్ పూజాహెగ్డే పాల్గొంటున్నారు. 2021వ సంవత్సరం జనవరి 21 వ తేదీ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీ రిలీజ్ కానుందని హీరో అఖిల్ అనౌన్స్ చేశారు. ఈ మూవీ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న స్పై థ్రిల్లర్ మూవీ కి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హీరోయిన్ పూజాహెగ్డే ప్రభాస్ హీరోగా రూపొందుతున్న “రాధేశ్యామ్ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: