అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్` సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఇన్ని రోజులు పూజా హెగ్డే షూటింగ్ లో పాల్గొనగా.. ఇప్పుడు అఖిల్ కూడా షూటింగ్ లో పాల్గొన్నాడు. సెట్స్ లో ఉన్న ఫొటో ను పోస్ట్ చేస్తూ ఇక ఈ విషయాన్ని తన ఇన్స్టా ద్వారా తెలిపాడు అఖిల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫైనల్లీ వర్క్ మోడ్ లోకి వచ్చినందుకు చాలా గ్రేట్ గా ఉంది. ప్రామిస్ సెట్స్ లో మేమిద్దరమే మాస్క్ వేసుకోలేదు. ఎందుకంటే మేము మాస్క్ వేసుకుంటే సినిమాలో గుర్తుపట్టరని అంటూ కామెడీ చేసాడు.
కాగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా… గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆమని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా భారీ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సరెండర్2సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. వక్కంతం వంశీ ఈ సినిమాకు పవర్ ఫుల్ స్టొరీ అందించినట్టు తెలుస్తుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: