కోట్లాది అభిమానులు అభిమానించే మెగా స్టార్ చిరంజీవి దాదాపు 10 సంవత్సరాలు సినిమాలకు దూరం అయ్యి బ్లాక్ బస్టర్ “ఖైదీ నెం 150 “మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. సినిమాలకు కానీ సోషల్ మీడియా కు కానీ చాలా కాలం పాటు దూరంగా ఉన్న చిరంజీవి మూవీ తో పాటు సోషల్ మీడియా లో ఎంటర్ అయ్యారు. సోషల్ మీడియా లో ఎంటర్ అయిన 24 గంటలలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకొన్నారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న “ఆచార్య ” మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో చిరంజీవి తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలు , రాజకీయ , సామాజిక సంబంధిత విషయాలను షేర్ చేసి ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తక్కువ వ్యవధి లో ఇన్ స్టా గ్రామ్ లో చిరంజీవి 1 మిలియన్ ఫాలోవర్స్ తో రికార్డ్ క్రియేట్ చేశారు. గుండు తో ఉన్న తన ఫొటో ను చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. “ఆచార్య ” మూవీ తో పాటు “లూసిఫర్ “, “వేదాళం ” మూవీస్ తెలుగు రీమేక్ లకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: