లాక్ డౌన్ లేకపోతే ఎప్పుడూ షూటింగ్ లు అంటూ బిజీగా వుండే హీరోయిన్స్ లాక్ డౌన్ లో మాత్రం గరిటె పట్టుకొని చెఫ్ లుగా మారిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ వంటలు చేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసిన సందర్భాలు వున్నాయి. ఇక్కడ మరో హీరోయిన్ కూడా చెఫ్ గా మారిపోయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు బుట్టబొమ్మ అదే పూజా హెగ్డే. ఖాళీ టైం దొరకడంతో వంటగదిలో ప్రయోగాలు చేస్తూ సరికొత్త వంటకాలను పరిచయం చేస్తోంది. తాజాగా తన తండ్రి కోసం జానీ వాకర్ టామెరెండ్ హై బాల్ అనే ప్రిపేర్ చేసి ఇచ్చినట్టు తెలిపింది. అంతేకాదు ఎలా చేయాలో ప్రాసెస్ కూడా చెప్పింది. మరి ఫ్యాన్స్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రేస్లో ముందు ఉంది పూజా హెగ్డే. అల వైకుంఠపురములో, గద్దలకొండ గణేష్, మహర్షి, అరవింద సమేత ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో సూపర్ ఫామ్ లోకి వచ్చేసింది. దాదాపు స్టార్ హీరోలందరితో ఈ బుట్టబొమ్మ జోడీ కట్టేసింది. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న రాధేశ్యామ్ సినిమాలో నటిస్తుంది. ఈ భారీ బడ్జెట్ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఇక మూవీతో పాటు అఖిల్ ‘బ్యాచ్లర్’ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా మారింది. ఇక హిందీలో కూడా పలు సినిమాలతో అక్కడ కూడా బిజీ గా మారేందుకు రెడీ అయింది
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: