సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు.. సూపర్ స్టార్ మహేష్ బాబు బావ అయినా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. తాజాగా వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. ఓటీటీలో సెప్టెంబర్ 05 న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ‘వి’ సినిమా చూసిన తన తల్లిదండ్రుల రియాక్షన్ ఏంటో తన ఇన్స్టా లో చెప్పుకొచ్చాడు సుధీర్ బాబు. మా అమ్మా నాన్న ఈ సినిమా చూసి చాలా హ్యాపీ గా వున్నారు.. వాళ్ల ఫ్రెండ్స్ దగ్గరనుండి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సంతోషంలో ఉన్నారు. ఈ సినిమా గురించి అందరూ తనకు మెసేజెస్.. కాల్స్ చేస్తుంటే కంప్లైంట్ ఇస్తుంది మాఅమ్మ.. సినిమాల విషయం దగ్గరకు వచ్చేసరికి నాకు.. మా నాన్నకు అంత కనెక్షన్ ఉండదు.. నా సినిమాల గురించి పెద్దగా ఆయన మాట్లడరు.. కానీ ‘వి’ సినిమా గురించి మాట్లాడటంతో.. నా కళ్లు చెమ్మగిల్లాయి.. ఇప్పటివరకూ నేను ఏదన్నా సాధించానని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు అని ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టాడు.
ఇక ఈ సినిమా తర్వాత ప్రముఖ బ్యాడ్మింటన్ పుల్లెల గోపించంద్ బయోపిక్ ని చేసేందుకు సిద్దం అయ్యాడు సుధీర్ బాబు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికే రెడీ అయిపోగా.. డిసెంబర్ లో షూటింగ్ మొదలు పెట్టనున్నట్లుగా కూడా ఇటీవల వెల్లడించాడు సుధీర్ బాబు. అంతేకాదు తెలుగు తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాని 2021 టోక్యో ఒలింపిక్స్ కంటే ముందు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక సినిమాకి సంబంధించిన మిగిలిన నటినటులను, సాంకేతిక నిపుణలను త్వరలోనే ఎంపిక చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: