తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఇక సీత పాత్రలో ఎవరు నటిస్తారు అనే దానిపై క్లారిటీ రావాలి. అయితే ఇప్పటివరకూ కీర్తి సురేష్, కియారా పేర్లు తెరపైకి వచ్చాయి. క్లారిటీ ఇచ్చేలోపు ఇంకెన్ని పేర్లు వస్తాయో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాను 3D మూవీగా రూపొందించనున్న సంగతి తెలిసిందే కదా. అయితే అవతార్ సినిమా కోసం పనిచేసిన వీఎఫ్ఎక్స్ టీమ్ ను ఈ సినిమా కోసం తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ ని ‘ఆదిపురుష్’ కోసం తీసుకురాబోతున్నారట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
కాగా కరోనా నిబంధనలతో ఆదిపురుష్ టీమ్ ప్రీ షూటింగ్ వర్క్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో గుల్షన్ కుమార్, టి-సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓం రౌత్, క్రిషణ్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాను 2022లో విడుదల చేసేలా ప్లాన్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: