గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రాక్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని ఘటనలను ఆధారంగా చేసుకొని గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉండగా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఇప్పటీకే విడుదల చేసిన రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్కు, టీజర్కు చాలా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా రవితేజ కొత్త స్టిల్ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో పోలీస్ యూనిఫామ్లో ఉన్న రవితేజ.. కళ్లకు గాగుల్స్ పెట్టుకొని మీసం మెలితిప్పుతూ ఇంటెన్స్ లుక్లో కనిపిస్తున్నారు. ఇంకో చేతిలో కూల్డ్రింక్ బాటిల్ కనిపిస్తోంది. ఈ లుక్ ప్రకారం ఆయన ఏపీ పోలీస్ ఆఫీసర్ పి. వీరశంకర్ అని తెలుస్తోంది. ఈ చిత్రంలోని ఓ పాటను కూడా త్వరలో రిలీజ్ చేయనున్నారట. అంతే కాదు ఇంకా 15 రోజుల షూటింగ్ మిగిలి ఉందని ఇప్పటికే చిత్రయూనిట్ కూడా తెలిపిన సంగతి గుర్తుండేవుంటుంది కదా. త్వరలో ఆ షెడ్యూల్ను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారట.
కాగా ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ సినిమాతో శ్రుతి హాసన్ టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను… సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: