దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబానికి కరోనా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అందరూ కోలుకున్నారు. అంతేకాదు కరోనా నుండి కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం చేస్తామని చెప్పిన సంగతి కూడా గుర్తుండే ఉంటుంది కదా. ఇక చెప్పినట్టే ఈరోజు కీరవాణి, ఆయన తనయుడు కాలభైరవ ప్లాస్మా డొనేట్ చేశారు. కిమ్స్ హాస్పిటల్లో ఈ రోజు ప్లాస్మాను డొనేట్ చేసినట్టు ఒక ఫొటో ను పోస్ట్ చేస్తూ కీరవాణి సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే రాజమౌళి ఇంకా ప్లాస్మా డొనేట్ చేయలేదు. ఈ క్రమంలో ప్లాస్మాను తాను డొనేట్ చేయకపోవడానికి గల కారణాన్ని ట్విట్టర్లో రాజమౌళి తెలిపారు. ‘‘యాంటీ బాడీస్ కోసం టెస్ట్ చేశారు. నా ఐజీజీ లెవల్స్ 8.62గా ఉన్నాయి. కానీ ఆ లెవల్స్ 15గా ఉండాలి. ఈరోజు పెద్దన్నయ్య, భైరవ ప్లాస్మాను డొనేట్ చేశారు’’ అని క్లారిటీ ఇచ్చేశారు. మొత్తానికి అందరూ ఎందుకు ఇవ్వలేదని అడగకముందే రాజమౌళి ముందు జాగ్రత్తగా స్పష్టం చేసేశాడు.
Tested for antibodies.. My igG levels are 8.62. They should be above 15 to be able to donate… Peddanna and Bhairava donated today… pic.twitter.com/5zVmj0dvt0
— rajamouli ss (@ssrajamouli) September 1, 2020
కాగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: