సోషల్ మీడియాలోకి లేట్ గా ఎంట్రీ ఇచ్చినా దానిని కాస్త భిన్నంగా వాడటంతో చిరు స్టయిలే వేరే. ఏదైనా విషయాన్ని సస్పెన్స్ లో ఉంచి చెప్పడంలో చిరు తర్వాతే ఎవరైనా. తాజాగా మరోసారి అలాంటి సస్పెన్సే క్రియేట్ చేసి అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచారు చిరు. ఈ రోజు వరల్డ్ ఫొటోగ్రాఫీ డే అన్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీస్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈనేపథ్యంలో ఈ రోజు ప్రపంచ ఫొటోగ్రీఫీ డే.. నేను మొదటి ఫోటో తీసింది ఇలాంటి agfa3 కెమెరాతో. ఆ మొదటి ఫోటో మరి కాసేపటిలో..’ అంటూ చిరంజీవి పోస్టు చేశారు. కాసేపటి తర్వాత నేను తీసిన మొదటి ఫోటో.. ఈ ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు .. చెప్పుకోండి చూద్దాం.. అంటూ అభిమానులకు మరో ప్రశ్న వేసారు. ఇక ఆ ఫొటో చూసిన అభిమానులు గుర్తుపట్టకుండా ఉంటారా.. పీకే అంటూ రిప్లై ఇచ్చేపనిలో పడ్డారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇవ్వాళ #WorldPhotographyDay నేను మొదటి ఫోటో తీసింది ఇలాంటి #agfa3 కెమెరాతో. ఆ మొదటి ఫోటో మరి కాసేపటిలో…. … pic.twitter.com/YnVdZPOgys
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 19, 2020
నేను తీసిన మొదటి ఫోటో … … ఈ ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు … …చెప్పుకోండి చూద్దాం. #FirstPhotoTaken #WorldPhotographyDay pic.twitter.com/YyesoiiivX
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 19, 2020
ఇదిలాఉండగా ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ఇంకా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇంకా కామన్ మోషన్ పోస్టర్, కామన్ డీపీని రిలీజ్ చేయనున్నారు.
కాగా ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు లూసిఫర్ సినిమా రీమేక్ కూడా చేయనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: