ఏదైనా కొత్త సినిమా రాబోతుందంటే రూమర్స్ రావడం సహజం. అలాటింది ప్రభాస్ సినిమా.. భారీ బడ్జెట్ సినిమా.. బాలీవుడ్ డైరెక్టర్ అంటే ఆ సినిమాపై ఎన్ని రూమర్స్ వస్తాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది ఆదిపురుష్ సినిమాకు. ఈ సినిమాను నిన్ననే అధికారికంగా ప్రకటించారు. ఆదిపురుష్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కబోతుందని.. రామునిగా ప్రభాస్ కనిపించనున్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. సైఫ్ అలీఖాన్-ప్రభాస్ తో కలిసి నటించేది నిజమే అయితే సూపర్ కాంబినేషన్.. మరో హిట్టు రావడం ఖాయమేనంటున్నారు అభిమానులు. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యూరప్ లో కొంతవరకూ షూటింగ్ జరుపుకోగా… కరోనా వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: