గత కొద్దినెలల ముందు అయితే ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అన్నట్టు.. ఒక్క అప్ డేట్ ఒకే ఒక్క ప్రభాస్ సినిమా అప్ డేట్ అంటూ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారు ప్రభాస్ ఫ్యాన్స్. అయినా కూడా కష్టంగా ఉండేది. అయితే ఈ మధ్య కాస్త పంథా మార్చారు. ప్రభాస్ 20 రాధేశ్యామ్ సినిమా అప్ డేట్ ఇచ్చిన దగ్గర నుండి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ ఫ్యాన్స్ కు కాస్త ఊరట కలిగిస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఎలాంటి హడావుడి లేకుండా ప్రభాస్ 22 సినిమా అప్ డేట్ ఇచ్చి షాకిచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ప్రభాస్ 20 రాధా కృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ 21 మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో చేస్తున్నాడు. ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాటు ప్రభాస్ తన 22వ సినిమాకి సంబంధించిన వివరాలు కూడా అధికారికంగా ప్రకటించారు. గుల్షన్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో రెట్రోఫైల్స్ ప్రొడక్షన్, టి సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్ పై తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటెర్టైనెర్ గా రెడీ అవుతున్న ఈ చిత్రానికి “ఆది పురుష్” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్ ను ఈరోజు అధికారికంగా రిలీజ్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు ఓం రౌత్ కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Here comes another Big Announcement 🤩🤩
Celebrating the victory of good over evil! #Adipurush#Prabhas22#Prabhas @ItsBhushanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @retrophiles1 #TSeries @omraut pic.twitter.com/9l8O4KysDB— Telugu FilmNagar (@telugufilmnagar) August 18, 2020
మొత్తానికి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు సైన్ చేస్తూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. ఈ ఎపిక్ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ ఫాన్స్ ని అత్యంతగా ఆకట్టుకోవడం ఖాయం అని ఆది పురుష్ టీం చెబుతోంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: