‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్.. కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమల్ సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్లో సినిమా చేస్తున్నాడు. అయితే ఇటీవలే ఈసినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే అదేం లేదని ఈ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈ సినిమా విషయంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పారు లోకేష్ కనగరాజ్. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో లోకేష్ కమల్- సినిమాకు సంబంధించిన ప్రకటన త్వరలోనే ఇస్తామని.. అగ్రిమెంట్స్ పూర్తయిన తర్వాత తెలియచేస్తాం.. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన ఫ్యాన్స్ సెప్టెంబర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని తెలిపారు. మరి ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ లాంటిదే. మరి ప్రకటన కోసం సెప్టెంబర్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
ప్రస్తుతం రజినీ అజిత్తో ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’, ‘విశ్వాసం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన శివ కాంబినేషన్లో సినిమా చేస్తున్నాడు. ఖుష్బూ, మీనా హీరోయిన్స్గా నటిస్తున్న ఈ సినిమాలో…. కీర్తి సురేష్ ముఖ్యపాత్రలో నటిస్తోంది. మరోవైపు కమల్ ఇండియన్ 2 సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. తమ సినిమాలు పూర్తయిన తర్వాత ఈ సినిమాను మొదలుపెట్టనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: