గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. సినీ ప్రముఖులు భారీ స్థాయిలో పాల్గొంటున్నారు. అంతేకాదు మన తెలుగులో స్టార్ట్ అయిన ఈ ఛాలెంజ్ చిన్న చిన్నగా పక్కన ఇండస్ట్రీకి కూడా వెళ్తుంది. తన పుట్టినరోజున గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు విజయ్, శ్రుతీ హాసన్, ఎన్టీఆర్ కు ఛాలెంజ్ విసరగా ఇప్పటికే విజయ్ మహేష్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాడు. తాజాగా శ్రుతీహాసన్ కూడా మహేష్ ఛాలెంజ్ ను స్వీకరించింది. తాజాగా చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహేష్ తో పాటు దేవిశ్రీప్రసాద్ కూడా గతంలో శ్రుతీహాసన్ ను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తను మొక్కలు నాటుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ ఛాలెంజ్కు తనని నామినేట్ చేసిన మహేష్, దేవిశ్రీప్రసాద్కి శ్రుతి ధన్యవాదాలు తెలిపింది. ఇక తన తర్వాత ఛాలెంజ్కు హృతిక్ రోషన్, హీరోయిన్ తమన్నా, రానా దగ్గుబాటిని నామినేట్ చేసింది. ఇక శ్రుతీహాసన్ ట్వీట్ కు మహేష్ కూడా స్పందిస్తూ ప్రశంసించాడు. ఈ కార్యక్రమంలో ఇనిషియేట్ తీసుకున్నందుకు అప్రిషియేట్ చేశారు.
Appreciate it @shrutihaasan 🤗🤗🤗 Glad to see the initiative gaining momentum 👍👍👍
— Mahesh Babu (@urstrulyMahesh) August 12, 2020
ప్రస్తుతం శృతి హాసన్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న “క్రాక్ ” లో మూవీ నటిస్తుంది. ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహిస్తున్న లాభం అనే సినిమాలో కూడా శృతిహాసన్ నటించనుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: