మెగా డాటర్ నిహారిక పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది కూడా. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతున్నారు. జొన్నలగడ్డ వెంకట చైతన్య హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ఇక ఇరువురు కుటుంబాలకు మంచి అనుబంధం ఉండటంతో ఈ పెళ్లి నిశ్చయించారు. ఇక చైతన్యతో తీసుకున్న ఫొటోలను అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంది నిహారిక. ఈ నేపథ్యంలో ఆగష్ట్ లో ఎంగేజ్ మెంట్ అని.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరగనుందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం నిహారిక నిశ్చితార్ధం ఈరోజు జరగనున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు రాత్రి 8 గంటలకు చైతన్యతో నిహారిక ఎంగేజ్మెంట్ హైదరాబాద్లో జరగబోతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకుంటుంది నిహారిక. ఈరోజు నిశ్చితార్ధం కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొనబోతుందని సమాచారం. కోవిడ్ నిబంధనల ప్రకారం అతి కొద్ది మంది అతిథులను మాత్రమే ఆహ్వానించినట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం తమిళ్ లో ఒక సినిమా చేస్తుంది నిహారిక. గతంలో ‘ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్’ (2018) సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది నిహారిక కొణిదెల. ఇప్పుడు తాజాగా ఓ మై కడువలె సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తమిళ యంగ్ హీరో అశోక్ సెల్వన్ తో ఆమె నటించనుంది. పూర్తి స్థాయి కామెడీతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది. దీనితోపాటు ఓ వెబ్ సిరీస్లో నటించేందుకు కూడా నిహారిక సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టును మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: