సినిమా సినిమాకు వైవిధ్యతను చూపిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. మొదటి సినిమా ‘అ’ సినిమాతోనే తనలోని విభిన్నతను చూపించాడు. రెండో సినిమా కల్కి రాజశేఖర్తో చేసి ఆకర్షించారు. ఇక ఇప్పుడు మూడో సినిమాగా గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పై సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి.. ఇప్పటికే 40 శాతం పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అతని పుట్టినరోజు సందర్భంగా ప్రీ-లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. ‘జోంబీ రెడ్డి’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసి ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ టైటిల్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. థ్రిల్లింగ్, హారర్ జోనర్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి ఈ సినిమా కూడా వినూత్నంగా భయపెట్టబోతున్నట్లు తెలుపకనే తెలిపాడు ప్రశాంత్ వర్మ.
This time will entertain the hell out of you guys! 😈
👉https://t.co/hqxwhqBlWL#ZombieReddy #PV3@AppleTreeOffl pic.twitter.com/QVnxzV5Gd7
— Prasanth Varma 5.0 (@PrasanthVarma) August 8, 2020
కాగా ఆపిల్ స్టూడియోస్ బ్యానర్పై రూపొందుతున్న ఈ జోంబీ రెడ్డి సినిమాకు రాజశేఖర్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. సినిమా సినిమాకు కొత్తదనంతో కూడిన కథలను ఎంచుకునే ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: