టాలీవుడ్ సెలబ్రిటీస్ ను కరోనా వదలట్లేదు. రోజుకో సెలబ్రిటీ కరోనా బారిన పడుతున్నారు. బండ్ల గణేష్ మొదలుకుని, రాజమౌళి ఫ్యామిలీ, స్మిత, ఎస్.పి. బాలు ఇలా టాలీవుడ్కు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వైరస్ సోకిన వారిలో ఉన్నారు. ఇక తాజాగా మరో సెలబ్రిటీకి కరోనా సోకింది. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు ఆర్ఆర్ఆర్ నిర్మాత. ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డివివి దానయ్యకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లుగా తెలుస్తుంది. అయితే రాజమౌళికి కరోనా రావడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ నిమిత్తం రాజమౌళిని దానయ్య కలిసుండవొచ్చు అందుకే వచ్చిందేమో అంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘జంబలకిడి పంబ’ అనే కామెడీ చిత్రంతో నిర్మాతగా వెండితెరపై ప్రవేశించారు దానయ్య. అది సూపర్ డూపర్ హిట్ సాధించడంతో తొలి చిత్రంతోనే హిట్ ప్రొడ్యూసర్గా పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత అనేక హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కాగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ఈ, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘రౌద్రం రణం రుధిరం’. ఈ సినిమాలో స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: