మిగిలిన హీరోలు అప్పుడప్పుడు పబ్లిక్ లో కనిపిస్తారేమో కానీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బయట కనిపించడం చాలా అరుదు. మరి అలాంటి హీరో పబ్లిక్ లోకి వస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా… ఇప్పుడు అదే జరిగింది. ఈ రోజు ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకి వచ్చారు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు రావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ప్రభాస్ ను చుట్టుముట్టారు. ఆఫీసులో ఉన్న కొంతమంది ఉద్యోగులతో పాటు ఫ్యాన్స్ కూడా ప్రభాస్తో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. మాస్క్ ధరించే ప్రభాస్ ఫొటోలు దిగారు. ఇక ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధే శ్యామ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 1970 బ్యాక్డ్రాప్లో పీరియాడికల్ లవ్స్టోరీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ మరియు మలయాళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ చేయనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: