‘ఇండియన్ 2’ – మృతుల కుటుంబానికి కోటి విరాళం

Indian 2 Movie Team Donates 1 Crore Rupees Each To The Families Of Deceased In The Crane Accident

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ‘భారతీయుడు2’ ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. అయితే ఈ సినిమాకు మొదటి నుండి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఎలా షూటింగ్ మొదలైంది అనుకునే లోపు క్రేన్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో నాలుగు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ ఘటనతో మళ్లీ షూట్ కు బ్రేక్ పడింది. ఇక కేసులు.. విచారణలు అంటూ తిరిగేలోపు కరోనా వచ్చేసింది. దీనితో అసలు షూటింగులే లేకుండా పోయాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా క్రేన్ ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ఆదుకోడానికి ముందుకొచ్చారు హీరో కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్ హౌస్ లైకా సంస్థ. నలుగురు చనిపోగా.. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలు విరాళం అందచేశారు.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్, సిద్ధార్ధ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 6 =