భారత దేశంలో 18 లక్షలమంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. సుమారు 38 వేల మంది ప్రాణాలు కోల్పోయారు . ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా విజృంభిస్తుంది. ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 2లక్షల 35 వేల మంది పై కరోనా ప్రభావంచూపింది. చాలా మంది కరోనా నుండి కోలుకున్నారు. కొవిడ్ -19 నుండి కోలుకున్నవారి బ్లడ్ ప్లాస్మా తో కరోనా బాధితులను రక్షించవచ్చని డాక్టర్స్ చెబుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో హీరో నాని బ్లడ్ ప్లాస్మా దానానికై పిలుపునిచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Donate plasma .. Please.
Small effort can save lives 🙏🏼 https://t.co/wuB5ayuhSs— Nani (@NameisNani) August 3, 2020
గచ్చిబౌలి లోని సైబరాబాద్ కమిషనరేట్ లో CP సజ్జనార్ కొవిడ్-19 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి , ప్లాస్మా దానానికై ప్రముఖులతో విజ్ఞప్తి చేయిస్తున్నారు. ఈ నేపథ్యం లో నిన్న హీరో నాని మాట్లాడుతూ .. కొవిడ్ -19 నుండి కోలుకున్న ఒక వ్యక్తి 500 ఎమ్ ఎల్ ప్లాస్మాతో ఇద్దరు కొవిడ్ -19 బాధితులను రక్షించవచ్చని , ప్లాస్మా దానం చేసి మరికొంతమంది ప్రాణాలు కాపాడమని చెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్ లో చేపట్టిన ఈ కార్యక్రమానికి అందరూ తమవంతు సాయం అందించాలని హీరో నాని కోరారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: