టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ, మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాలోని పాటలపై క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో అతిథి పాత్రలో ఓ స్టార్ హీరోయిన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా. ఓ చిన్న పాత్రలో తమన్నా నటించనుందట… అంతేకాదు ఓ స్పెషల్ సాంగ్ కూడా చేయనున్నట్టు తెలుస్తుంది. ఇందుకు తమన్నా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ ఐటమ్ సాంగ్ కోసం మరోనటి రెజీనాను తీసుకున్న సంగతి తెలిసిందే. మరిప్పుడు రెజీనా ప్లేస్లో తమన్నాను తీసుకున్నారా? లేకా రెండు స్పెషల్ సాంగ్స్ ఉంటాయా అన్నది తెలియాల్సి ఉంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం టాలీవుడ్ లో జోరుగా వినిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా “సరిలేరు నీకెవ్వరు ” సినిమాలో కూడా స్పెషల్ సాంగ్స్ లో నటించింది తమన్నా . మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక చిత్రం `సైరా నరసింహారెడ్డి` ఈ చిత్రంలో లక్ష్మి పాత్రలో సైరా ప్రియురాలిగా తమన్నా కనిపించిన విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా40 శాతం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. కరోనా వచ్చి పడటంతో షూటింగ్ కు కూడా బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. కాగా ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: