ఈ మధ్య సోషల్ మీడియాలో పలు ఛాలెంజ్ లు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ ఒక ఛాలెంజ్ ను స్వీకరించారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా వాట్స్ ఇన్ యువర్ కిడ్స్ డబ్బా అనే ఛాలెంజ్ లో భాగంగా ఈ ఛాలెంజ్ స్వీకరించాలని నమ్రతను నామినేట్ చేసింది. దీనితో ట్వింకిల్ ఖన్నా ఛాలెంజ్ ను స్వీకరించిన నమ్రత తన పిల్లలు ఎలాంటి ఫుడ్ ఇష్టపడతారో.. తెలుపుతూ రెసిపీని కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన పిల్లలకి బెండకాయ ఫ్రై, చోళే మసాలా ఇంకా ఎల్లో రైస్ ఇష్టమని ఆ ఫొటోను కూడా పోస్ట్ చేసింది. అంతేకాదు.. నన్ను నామినేట్ చేసినందుకు ట్వింకిల్ ఖన్నా కు థ్యాంక్యూ.. ఇవే సితార, గౌతమ్ లకు ఇష్టమైన డిష్ అని.. ఎందుకంటే ఇండియన్ ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉంటుందని…వారంలో ఒక్క రోజైనా ఈ మెనూ ఉండాల్సిందే అని తెలిపింది. ఇంకా వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసేప్పుడు ఒక స్పూన్ నెయ్యి లేదా కొబ్బరి నూనె వాడతాను.. వాళ్ళ చిన్న పొట్టలకి మంచిదని చెపుతుంది. ఇక ఈ ఛాలెంజ్ ను తన సోదరి శిల్పా శిరోద్కర్ కు ఇంకా తన ఫ్రెండ్స్ కు విసిరింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నమ్రత సితార, గౌతమ్ లకు సంబంధించి పలు వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో మహేష్ కూడా ఇంట్లోనే ఉండటంతో మహేష్ పిల్లలతో ఆడే ఆటలకు సంబంధించిన వీడియోలు.. వాళ్ళ క్యూట్ మూమెంట్స్ ను కెమెరాలో బంధించి పోస్ట్ చేస్తూనే ఉంది.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఆగష్టు లేదా సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: