గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో యంగ్ హీరో శర్వానంద్ కూడా చేరాడు. గొప్ప విషయం ఏంటంటే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వచ్ఛందంగా స్వీకరించాడు శర్వా. బంజారాహిల్స్ లోని తన ఇంటి పక్కన ఉన్న పార్క్లో ఎంపీ సంతోష్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి మొక్కలు నాటారు.అంతేకాదు తమ ఇంటి పక్కన ఉన్న జీహెచ్ఎంసీ పార్కును దత్తత తీసుకొని అందులో మొక్కలు నాటుతానని కూడా చెప్పాడు. అనంతరం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను నిర్మాతలు ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర, 14 రీల్స్ ప్లస్ రామ్ ఆచంట- గోపి ఆచంట, యూవీ క్రియేషన్స్ నిర్మాతలు వంశీ – విక్కీ – ప్రమోద్, సుధాకర్ చెరుకూరి లకు మొక్కలు నాటాలని శర్వానంద్ ఛాలెంజ్ విసిరాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
I further nominate @AKentsOfficial @AnilSunkara1 garu, @14ReelsPlus @RaamAchanta garu & Gopi Achanta garu, @UV_Creations Vikky, Pramod & Vamsi anna, @SLVCinemasOffl Sudhakar garu to continue this wonderful initiative by Santosh garu 😊@bonthurammohan @DNRTRS
— Sharwanand (@ImSharwanand) July 13, 2020
కాగా ప్రస్తుతం శర్వానంద్ శ్రీకారం మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా శర్వా సూపర్ హిట్ “RX 100 ” మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ “మహాసముద్రం ” సినిమాను లైన్ లో పెట్టాడు. వీటితోపాటు శర్వానంద్ హీరోగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై శ్రీకార్తీక్ దర్శకత్వంలో ఒక సినిమాచేస్తున్నాడు. తెలుగు, తమిళ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్.ఆర్.ప్రకాశ్బాబు, ఎస్.ఆర్.ప్రభు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: