లాక్ డౌన్ నుండి ఎప్పుడైతే సడలింపులు చేశారో… అప్పటినుండి రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. దీనితో ఎవరికి వాళ్ళు జాగ్రతలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఇక ఇప్పటికే ఎంతో మంది దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఎన్నో సూచనలు చేశారు. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మరోసారి పలు సూచనలు చేశారు. నిజానికి కరోనా ప్రారంభమైనప్పటి నుండి సోషల్ మీడియా ద్వారా పలు జాగ్రత్తలు, సూచనలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మాస్క్లు ధరిస్తూ, వీలైనంతగా భౌతిక దూరం పాటించాలని ఇప్పటికే ఎన్నో వీడియోలలో ఆయన చెప్పి ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘‘లాక్డౌన్ సడలింపుల తర్వాత కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇది మనల్ని, మన చుట్టు పక్కల ఉన్నవారిని రక్షించుకోవాల్సిన సమయం. బయటికి వెళుతున్న ప్రతిసారి మాస్క్ను ధరించండి. మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాల గురించి తెలుసుకోండి… సోషల్ డిస్టెన్స్ మైంటైన్ చేస్తూ.. ఆరోగ్య సూత్రాలు పాటించండి అంటున్నారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ ఆరోగ్యసేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి… ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మీరు వెళ్లే ప్రదేశాల్లో కోవిడ్ బారిన పడిన వారు ఉంటే మిమ్మిల్ని అలర్ట్ చేస్తుంది. అలాగే ఈ యాప్ ఆరోగ్య సంరక్షణ, అత్యవసర సేవలను కల్పించడంలో సహాయపడుతుంది. అందరూ సురక్షితంగా ఉండండి. కోవిడ్ 19 గురించి తెలుసుకుని మరింత బాధ్యతగా మెలగండి’’ అని మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: