పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ఒకప్పటి హీరోయిన్, పవన్ కళ్యాన్ మాజీ భార్య రేణు దేశాయ్ చేస్తున్నారంటూ గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. దీంతో ఈ విషయమై తాజాగా రేణు దేశాయ్ స్పందించి ఆమె క్లారిటీ ఇచ్చారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఓ టీవీ చానెల్ తో మాట్లాడిన ఆమె.. ఈ మధ్య కాలంలో ఇదే నేను విన్న అతి పెద్ద రూమర్ అని అన్నారు. గత రెండు మూడు రోజులుగా తనకు చాలా మంది ఫోన్ చేసి అభినందనలు చెబుతున్నారని, ఇలాంటి వార్తలను తెరపైకి తెచ్చిన వారికి హ్యాట్సాఫ్ చెబుతున్నానని అన్నారు. మహేశ్ బాబుతో సినిమాకు, తనకు ఎటువంటి సంబంధమూ లేదన్నారు. ఇంత పెద్ద చిత్రంలో తనకు నటించే అవకాశం వస్తే, తానే ప్రకటన చేసుండేదాన్నని, తనకు కూడా నటించాలని ఉందని, గతంలో తల్లి పాత్రల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, హీరోల చిన్నప్పటి పాత్రలకు తల్లిగా చేసేందుకు అంగీకారం తెలిపానని, దాని ఆధారంగానే ఈ రూమర్ బయటకి వచ్చి ఉండొచ్చని అన్నారు. మరిఇప్పటికైనా ఈ రూమర్స్ ఆగుతాయో?లేదో?చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: