శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తోన్న సినిమా ‘శశి’. ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు వచ్చింది. ఒక పాట మినహా సినిమా షూటింగ్ అంతా పూర్తయింది. ఆ పాటను కూడా మూడు రోజుల్లో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇన్ని రోజుల తర్వాత ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ‘శశి’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయని బ్యానర్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఆది డబ్బింగ్ చెబుతున్న ఫొటోను షేర్ చేశారు. లాక్డౌన్ ముగిసి, సినిమాల షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన దానికి అనుగుణంగా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ డబ్బింగ్ పనులు స్టార్ట్ చేశారు.
ఇప్పటివరకూ కనిపించని సరికొత్త రూపంలో ఆది ఈ సినిమాలో కనిపించనున్నారు. కాగా లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన జోడీగా సురభి నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో నాయిక పాత్రను రాశీ సింగ్ కూడా నటిస్తుంది. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్పై ఆర్.పి. వర్మ, రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ అమర్నాథ్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: