లాక్ డౌన్ లో ఎంతమంది సెలబ్రిటీస్ తమ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతున్నారో తెలియదు కానీ… సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఈ టైమ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మామూలుగానే మహేష్ బాబు కాస్త తీరిక సమయం దొరికినా ఫ్యామిలీతోనే ఎక్కున ఉండటానికి ఇష్టపడతాడు. అలాంటిది ఈ లాక్ డౌన్ వల్ల కావాల్సినంత టైం దొరికింది. దీనితో పిల్లలు సితార, గౌతమ్ తో కలిసి ఆడుతూ, పాడుతా టైం స్పెండ్ చేస్తున్నాడు. ఆ ఫోటోలను, వీడియోలను నమ్రత ఎప్పుటి కపుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే వుంది. మొన్ననే ప్రిన్స్, సితార కలిసి ‘టంగ్ – ట్విస్టర్’ గేమ్ ఆడారు. ‘ఓడిపోయావ్’ అంటూ తండ్రితో సితార అల్లరి చేయటం కనిపిస్తుంది. ఇక ఇప్పుడు మరో వీడియో ను పోస్ట్ చేశారు. ఈ సారి సితార తన ఇన్స్టా లో ఈ వీడియోను పంచుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ వీడియోలో మహేష్, సితార స్విమ్మింగ్ చేస్తుంటారు. నాన్నతో మొదటి రేస్.. చాలా ఫన్ గా ఉంది.. తన చేతులు నాకంటే పెద్దగా వున్నాయి.. ఇది నా మొదటి రేస్ అని పోస్ట్ లో పేర్కొంది.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఆగష్టు లేదా సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: