సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక నటించిన “సరిలేరు నీకెవ్వరు “, “భీష్మ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న “పుష్ప ” మూవీ లో కథానాయిక గా నటిస్తున్నారు. “సుల్తాన్ “తమిళ మూవీ తో కోలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. కన్నడ మూవీస్ లో కూడా నటిస్తున్న రష్మిక లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న రష్మిక ఒక షార్ట్ స్టోరీ ని రాసి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఫస్ట్ పార్ట్ ను షేర్ చేసిన రష్మిక రెండవ పార్ట్ ను షేర్ చేశారు. మైరా బ్లూ శారీ కట్టుకుని ప్రతీ రోజూ అగ్ని మహల్ మెట్లపై కూర్చుని తన కోరిక నెరవేరే క్షణాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మహల్ పని వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటుంది. అగ్ని మహల్ మెట్ల పై కూర్చుని కొన్ని నెలలుగా మైరా ఎదురుచుస్తూ ఉంటుంది. ఈ రోజు కూడా పక్షుల కిలకిలారావాలు వింటూ మెట్ల పై సెటిల్ అయింది. మైరా హృద వేదన ను ప్రతిబింబిస్తూ సూర్యకాంతి ప్రసరిస్తూ ఉంది. ఈ రోజు కూడా మార్పు లేదు. మహల్ లో ఉదయం సందడి మొదలు అయింది. బెంగ గా ఉన్న హృదయం తో మైరా నిరీక్షిస్తూ ఉంది. మైరా నిరీక్షణ త్వరలోనే నెరవేరనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: