కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఐకానిక్ సినిమా పెదరాయుడు రీసెంట్ గానే 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మోహన్బాబు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు పెదరాయుడు సినిమా సీక్వెల్ తెరపైకి వచ్చింది. దీనికి కారణం త్వరలో మోహన్ బాబు ఒక ఫ్యామిలీ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెప్పడమే. నిజానికి చాలా సంవత్సరాల క్రితమే పెదరాయుడు సినిమాకు సీక్వెల్ చేయాలని భావిస్తున్నట్లుగా ప్రకటించాడు. అయితే ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల ఆ ప్రయత్నం విరమించుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. అలాంటి క్లాసిక్ కు సీక్వెల్ తీయాలంటే చాలా కష్టం. అయితే.. మంచు విష్ణు, మనోజ్ కానీ ఈ సీక్వెల్ తీసే అవకాశం వుంది అన్నట్టు తెలిపారు. అంతేకాదు ఓ అందమైన కుటుంబ కథ తయారు చేశాం. ‘పెదరాయుడు’ సినిమాలా మంచి నటీనటులుంటారు. ఆ సినిమా వివరాలు త్వరలో చెబుతా అని మోహన్ బాబు చెప్పడంతో మరోసారి ఈ సీక్వెల్ తెరపైకి వచ్చింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ప్రస్తుతం మోహన్ బాబు, సూర్య నటిస్తున్న ‘సూరారై పొట్రు’ తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.. దీనితో పాటు మణిరత్నం మూవీ ‘పొన్నియన్ సెల్వన్’లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తెలుగులో మహానటి సినిమాలో తప్ప ఇంతవరకూ మరే సినిమాలో కనిపించలేదు. త్వరలోనే మరో తెలుగు సినిమాతో రానున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: