లాక్ డౌన్ లో సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్స్ కు కూడా లేకపోవడంతో సోషల్ మీడియా కు దగ్గరకు ఉంటున్నారు. ఇక టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక కరోనా లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయ్యి సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఫోటోలు, వీడియో లు షేర్ చేస్తూ రష్మిక టైమ్ పాస్ చేస్తుంది. తాజాగా తన తండ్రి గురించి రష్మిక ఇన్స్టాగ్రామ్లో ఓ భావోద్వేగ పోస్ట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాన్న గురించి ఏం చెప్పాలి. నేను పుట్టడానికి రెండ్రోజుల ముందు.. పొడవైన జుట్టు, పెద్ద కళ్లు ఉన్న ఓ చిన్నారి తన పొట్ట మీద డ్యాన్స్ చేస్తున్నట్టు మా నాన్నకి కల వచ్చిందట. ఆ కల గురించి మా నాన్న నాకు తరచుగా చెప్పేవారు. నా చిన్నతనంలో మా నాన్న ఎప్పుడూ బిజినెస్ పనులతో బిజీగా ఉండేవారు. ఆ తర్వాత నేను హాస్టల్కు వెళ్లిపోయాను. చదువుతో బిజీ అయిపోయాను. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చేశాను. నేను ఇప్పుడు ఆయన వ్యాపార భాగస్వామిని. నా ఈ ప్రయాణంలో ఆయన మెయిన్ పిల్లర్గా నిలిచారు. మేం పెద్దగా మాట్లాడుకోం. అయితే ఒకరి మీద మరొకరికి ప్రేమ ఉందని అర్థం చేసుకుంటాం` అంటూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రష్మిక షేర్ చేసింది.
ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` వంటి విజయాలను తన ఖాతాలో వేసుకున్న రష్మిక.. ప్రస్తుతం అల్లుఅర్జున్ సినిమా పుష్పలో నటిస్తుంది. ఈ సినిమాలోకూడా రష్మిక పాత్ర హైలైట్ అని చెపుతున్నారు. చూద్దాం మరి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: