అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లు గా వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత సన్సేషన్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టింది. ఇక ఈ సినిమా తర్వాత కార్తికేయ, పాయల్ ఇప్పటికే పలు సినిమాల్లో నటించగా.. అజయ్ భూపతి మాత్రం తన రెండో సినిమాను ఇంతవరకూ పట్టాలెక్కించలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం మహాసముద్రం అనే మల్టీ స్టారర్ కథతో సిద్ధం చేసుకున్నాడు. వైజాగ్ నేపథ్యంలో వినూత్న కథతో సాగే ఈ చిత్రం ఆర్ ఎక్స్ 100 తరహాలోనే ఉంటుందంటున్నాడు దర్శకుడు. ఇక ఈ సినిమాలో మొదట రవితేజ ను హీరోగా అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమానుండి రవితేజ తప్పుకున్నాడు. ఆ తర్వాత తాను పలువురు హీరోలకి చెప్పగా కొందరు డేట్స్ అడ్జెట్స్ చేయలేక నో చెప్పారు. ఫైనల్ గా శర్వానంద్ ను ఫైనల్ చేసాడు. ఇక మరో హీరోగా సిద్ధార్ద్ చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే ఈ సినిమాలో సిద్ధార్థ్ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించనున్నాడట. శర్వా కి సిద్ధార్థ్ కు మధ్య ఆసక్తికర సన్నివేశాలు ఉంటాయట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అదితి రావు హైదరి హీరోయిన్ నటించనున్నట్టు తెలుస్తుంది. లాక్ డౌన్ తర్వాత సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: