ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ‘పెంగ్విన్’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. జూన్ 19వ తేదీన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. తెలుగు, తమిళ్ వెర్షన్లను ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. తెలుగులో సమంత రిలీజ్ చేయగా.. తమిళ్ లో త్రిష మలయాళంలో మంజు వారియర్, హిందీలో తాప్సి ఈ సినిమా టీజర్ లను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసేలా ఉంది. కీర్తి సురేష్ నటనతో పాటు విజూవల్స్ ఆకట్టుకుంటున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ కొడుకు తప్పిపోవడంతో కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనే విధంగా టీజర్ లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ని చూపించారు. చివరగా కనిపించే ఆ సైకో ఎవరనేది కాన్సెప్ట్. మరి చూడబోతే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చేలాగే కనిపిస్తుంది.
కాగా స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాషన్ స్టూడియోస్ పతాకం పై సూపర్ స్టార్ రజినీకాంత్ పేట సినిమాకు దర్శకత్వం వహించిన కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: