కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లో షూటింగ్స్ నిలిచిపోయి సినీ సెలబ్రిటీస్ ఇంటికే పరిమితం అయిన విషయం తెలిసిందే. రెండు నెలలకు పైగా స్తంభించిపోయిన చిత్ర పరిశ్రమకు తమిళనాడు ప్రభుత్వం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకునేలా వెసులుబాటు కల్పించింది. దీంతో సినీ తారలు మోడరన్ టెక్నాలజీ తో ఇంటినుండే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఫొటో ” మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన అంజలి “కాట్రాడు తమిళ ” మూవీ తో కోలీవుడ్ లో అడుగు పెట్టి కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తెలుగు లో “సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు “, “బలుపు “, “గీతాంజలి ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. అంజలి ప్రస్తుతం పరువు హత్యల నేపథ్యం లో నాలుగు భిన్న కథలతో నలుగురు దర్శకుల దర్శకత్వంలో రూపొందుతున్న ఆంథ్రాలజీ మూవీ లో నటించారు. ఈ మూవీ ని గౌతమ్ మీనన్ , వెట్రిమారన్ , సుధకొంగర , విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతుంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక కథ లో నటించిన అంజలి తన ఇంటి నుండే డబ్బింగ్ పూర్తి చేశారు. క్వారంటైన్ డబ్బింగ్ ఆన్ ఏ వీడియో కాల్ అంటూ వ్యాఖ్యానించి అంజలి తాను డబ్బింగ్ చెబుతున్న వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: