లాక్ డౌన్ వల్ల సినీ పరిశ్రమకు బాగానే లాస్ వచ్చింది. సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఆగిపోయాయి. దీనితో కొన్ని వేల కోట్లే నష్టం వచ్చింది. ఒకవేళ సినిమా షూటింగ్ లకు అనుమతులు ఇచ్చినా కూడా బడ్జెట్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలో కొంతమంది దర్శక నిర్మాతలు ముందు భారీ బడ్జెట్ అనుకున్నా ఇప్పుడు తమ బడ్జెట్ ను తగ్గించాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రామ్ చరణ్ నిర్మాతగా ఆయన నటిస్తున్న ఆచార్య మూవీ బడ్జెట్ కూడా తగ్గించే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మొదటినుండి ఈ సినిమాకు కూడా చాలా ఆటంకాలే వచ్చాయి. ఇప్పటికే కొంత నష్టంలో ఉంది. ఇక ఇప్పుడు ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ సెట్స్ పైకి వెళ్లనుంది. దానికితోడు ఇప్పుడు పరిస్థితులు కూడా బాలేవు. అందుకే చిరు కూడా భారీ బడ్జెట్ తో నిర్మించకపోవడమే మంచిదని..తక్కువ బడ్జెట్ తో ప్లాన్ చేయమని చరణ్ కు చెప్పారట. చరణ్ కూడా ఆ విధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా కొరటాల శివ-చిరు కాంబినేషన్ ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. అయితే చూడాలి మరి ఈ సినిమా షూటింగ్ తిరిగి మరల ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది.ఇక ఈ సినిమా తర్వాత చిరు లూసిఫర్ రీమేక్ సినిమా చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: