సక్సెస్ ఫుల్ “అర్జున్ సురవరం ” మూవీ తో ప్రేక్షకులను అలరించిన లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “A 1 ఎక్స్ ప్రెస్ ” మూవీ లో హాకీ ప్లేయర్ గా నటిస్తున్నారు. కార్తికేయ హీరోగా రూపొందుతున్న మాస్ ఎంటర్ టైనర్ “చావు కబురు చల్లగా ” మూవీ లో హీరోయిన్ గా లావణ్య నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయిన లావణ్య సోషల్ మీడియా లో తరచూ అభిమానులతో ముచ్చటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇన్ స్టా గ్రామ్ వేదికగా క్విజ్ మీ లో భాగంగా అభిమానుల పలు ప్రశ్నలకు లావణ్య జాబిచ్చారు. ఒక అభిమాని ప్రశ్నకు ఎవరైనా చెప్పిన సమయానికి కాకుండా ఆలస్యంగా వస్తే తనకు నచ్చదని , తనకు సహనం తక్కువని చెప్పారు. మీకు మీరే వార్నింగ్ లేబుల్ ఇచ్చుకోమని అడిగితే తనను ముట్టుకుంటే బ్లాస్ట్ అయిపోతారు అనే లేబుల్ ఇస్తానని అంటూ సరదాగా జవాబిచ్చారు. ప్రతీ రోజూ వర్క్ అవుట్స్ చేయకపోతే తన మనసుకు నచ్చదని మరో అభిమాని ప్రశ్నకు లావణ్య జవాబిచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: