దాదాపు రెండు నెలల నుండి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ నేపథ్యంలో హీరోయిన్ రష్మిక మందన్న సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. ఇప్పటికే లైవ్ ల ద్వారా పలుమార్లు అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగే ప్రశ్నలకు కాస్త కొంటెగా సమాధానాలు కూడా ఇచ్చేది. ఇక ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ లాక్ డౌన్ అనుభవం గురించి కాస్త ఎమోషనల్ గా ఒక నోట్ రాసుకొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ లాక్ డౌన్ లో దాదాపు రెండు నెలల నుండి ఇంట్లోనే ఉంటున్న.. 18 ఏళ్ళ వరకూ నా లైఫ్ చాలా ఉరుకులు పరుగులతో బిజీగా ఉండేది.. ఎప్పుడైతే ఎండింగ్ పాయింట్ వచ్చిందనుకున్నానో.. మళ్ళీ రేస్ మొదలైంది… అయితే నేను కంప్లైనింగ్ ఇవ్వడంలేదు.. ఇది నేను ఎప్పుడూ కోరుకునేదే.. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకూ నా లైఫ్ లో నేను ఇన్నిరోజులు ఇంట్లో ఉండటం ఇదే మొదటిసారి… స్కూల్ జీవితం మొత్తం హాస్టల్ లోనే జరిగింది.. అప్పుడు నేను అనుకునేదాన్ని… మా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ అని. ఆ తర్వాత నా షూటింగ్స్ అప్పుడు నాతో పాటే మా అమ్మ నైట్ మొత్తం సెట్స్ లో నాతో పాటు ఉండేది.. మా నాన్న ఫ్యామిలీ తో క్వాలిటీ సమయాన్ని గడపడానికి చూస్తుండే వాళ్ళు. ఇక ఇప్పుడు నేను దాదాపు రెండు నెలల నుండి ఇంట్లోనే ఉంటున్నా.. అయితే ఇంట్లో వర్క్ గురించి మాత్రం మేము పెద్దగా మాట్లాడుకోము.. ప్రతి విషయంలో నాకు స్ట్రెన్త్ ను ఇవ్వడం.. నన్ను కేర్ గా చూసుకోడమే వాళ్ళ పని అని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇంట్లో ఉంటే ఇంత హ్యాపీగా.. ప్రశాంతంగా ఉంటుందని నేను అనుకోలేదు అని అన్నారు.
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న “పుష్ప “మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ నిలిచిపోయింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: