సూర్య బ్రదర్స్ మల్టీ స్టారర్ మూవీ ?

Versatile Actor Suriya and Karthi To Do A Multi Starrer Movie Together

గోల్డ్ కాయిన్ మోషన్ పిక్చర్స్ కంపెనీ బ్యానర్ పై సఛై దర్శకత్వంలో పృథ్విరాజ్ , బిజూ మీనన్ ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “అయ్యప్పనుమ్ కోషియుమ్ “మలయాళ మూవీ 2020 సంవత్సరం ఫిబ్రవరి 7 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తెలుగు, హిందీ భాషలలో రీమేక్ కానుంది. ఇప్పుడు తమిళ భాషలో కూడా రీమేక్ కానుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అయ్యప్పనుమ్ కోషియుమ్ “మలయాళ మూవీని హీరోలు సూర్య, కార్తీ లు చూడడం జరిగిందని, ఈ మూవీ ఇద్దరికీ నచ్చడంతో తమిళ రీమేక్ రైట్స్ సూర్య స్వంతం చేసుకున్నట్టు సమాచారం. సూర్య హీరోగా సెటిల్ అయిన తరువాత కార్తీ కోలీవుడ్ లో ప్రవేశించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. “అయ్యప్పనుమ్ కోషియుమ్ “మూవీ రీమేక్ ద్వారా అన్నదమ్ములు ఇద్దరూ కలసి నటించాలనే కోరిక నెరవేరనుంది. ఈ వార్త అభిమానులకు సంతోషం కలిగించే వార్తే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − nine =