కరోనా మహమ్మారి ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది . ఈ కరోనా వైరస్ వలన చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారు. మరికొంతమంది ప్రాణాలతో పోరాడుతున్నారు.ప్రస్తుతం లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు చేసారు కానీ దీనివల్ల కూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో మనకి మనమే జాగ్రత్తలు తీసుకోవాలని.. బయటకు వెళ్తే మాస్క్ లు తప్పనిసరి అని శానిటైజర్లు కూడా ముఖ్యమని ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని చెబుతున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక ఇదే అంశంపైన సెలబ్రిటీలు కూడా తమ వంతు భాధ్యతగా కరోనా పై జాగ్రత్తలు చెబుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే మాస్క్ ధరించాలని చెప్పిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇప్పుడు మరోసారి తన ట్విట్టర్ మాస్క్ ఇండియా అని చెపుతున్నారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ ఓ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. నోటికి చేయి అడ్డుపెట్టుకుని ఉన్న కొందరు ప్రముఖ సెలబ్రిటీల పాత ఫొటోలను సేకరించి వాటి ద్వారా మాస్క్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. మహేష్ బాబు, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, ధోనీ, హృతిక్ రోషన్, ఆలియా భట్, ప్రియాంకా చోప్రా, టైగర్ ష్రాఫ్ పాత ఫోటోలను సేకరించి వాటిని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. `దయచేసి మాస్క్ ధరించండి.. అది సురక్షితం` అంటూ కామెంట్ చేశారు. ఇక ఆ ఫొటోను మహేష్ బాబు తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్ అని అన్నారు.
#WearTheMask@avigowariker‘s simple yet effective initiative 👍🏻👍🏻👍🏻 #MaskIndia pic.twitter.com/vLjYeXbkB9
— Mahesh Babu (@urstrulyMahesh) May 27, 2020
మహేష్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి తర్వాత ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మరో సెన్సషనల్ హిట్ అందుకున్నాడు. లాక్ డౌన్ ముగిసిన వెంటనే మహేష్ బాబు…పరశురామ్ సినిమా ప్రారంభం అవుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: