సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అనారోగ్యానికి గురయ్యారని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలిలోని గ్యాస్ట్రో ఎంటరాలజీలో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స చేస్తున్నారన్న వార్తలు వినిపించాయి. అయితే మరోవైపు ఈ వార్తల్లో నిజం లేదు.. కేవలం పుకార్లు అన్న మాట కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో దీనిపై నటుడు ఉత్తేజ్ స్పందించి… సుద్దాల అశోక్ తేజ అనారోగ్యం గా ఉన్నారన్న వార్తలు వాస్తవమేనని అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా అశోక్ తేజ ఆరోగ్యంపై వివరణ ఇస్తూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ వీడియోలో ఉత్తేజ్ మాట్లాడుతూ…సుద్దాల అశోక్ తేజగారు మా మామయ్య అని అందరికీ తెలిసిన విషయమే. తను అనారోగ్యంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో వస్తుంది. అది నిజమే. ఈ రోజు సాయంత్రం సర్జరీ ఉంది. తన ఫ్రెండ్తో బ్లడ్ అవసరం ఉంటుందేమో అని చెబితే.. ఆ ఫ్రెండ్ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడంతో. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానితో సోషల్ మీడియా మొత్తం మామయ్య ఆరోగ్యం గురించి రకరకాలుగా రాస్తున్నారు. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. బ్లడ్ అవసరం ఉండింది. వెంటనే నేను చిరంజీవిగారి బ్లడ్ బ్యాంక్కు ఫోన్ చేయడం, అక్కడ స్వామినాయుడుగారు, ముఖేష్గారు వెంటనే రియాక్ట్ అయ్యి, బ్లడ్ డొనేటర్స్ని పంపించడం కూడా జరుగుతుంది. మామయ్య మీద గౌరవంతో, ప్రేమతో ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగిన వారందరికీ చాలా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిగారు, అన్నయ్య.. ఈ విషయం తెలిసిన వెంటనే మార్నింగ్ నాకు ఫోన్ చేసి మామయ్యకు ఎలా ఉందని కనుక్కుని, వీలైతే మామయ్యతో మాట్లాడించు అని చెప్పారు. నేను వెంటనే మామయ్యని అన్నయ్య చిరంజీవితో మాట్లాడించాను. అన్నయ్య మాటలు మామయ్యకు కొండంత ధైర్యాన్ని, కొండంత నమ్మకాన్ని కలిగించాయి. టోటల్ పరిశ్రమే తనతో మాట్లాడినట్లుగా, ఎంతో ధైర్యంగా హాస్పటల్కు వెళుతున్నానురా.. అని మామయ్య చెప్పారు. అన్నయ్య సహృదయతకు కృతజ్ఞుడిని. సుద్దాల అశోక్ తేజగారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మనందరి అభిమానం, ప్రేమతో ఆయన హ్యాపీగా బయటికి వచ్చి మళ్లీ బోలెడన్ని పాటలు రాస్తారని కోరుకుందాం..’’ అని తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: