సినిమా షూటింగ్ లపై.. ఎలాంటి కార్యాచరణలు తీసుకోవాలి అన్న విషయాలపై నిన్న మెగా స్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో పాటు టాలీవుడ్ ప్రముఖనిర్మాతలు, డైరెక్టర్స్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ సమావేశంలో సినిమాల షూటింగ్స్ ఎప్పుడు ప్రారంభించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. రేపటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకోవడానికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాస్కులు ధరించాలి. శానిటైజర్లు ఉపయోగించాలి. భౌతిక దూరం పాటించాలని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే షూటింగ్స్ కు ఎప్పటినుండి అనుమతి ఇస్తారా అన్నది చూడాలి. థియేటర్స్ అయితే అప్పుడే తెరిచే పరిస్థితులు లేవు. ఇక ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. కరోనా వల్ల దాదాపుగా రెండు నెలల నుండి షూటింగ్స్ ఆగిపోయాయి. థియేటర్స్ మూతపడ్డాయి. ఒక వేళ రీ ఓపెన్ చేస్తే ఎలా చేయాలి.. గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తది.. ఇండస్ట్రీ నుండి ఎలా చేయాలి లాంటి విషయాలు మాట్లాడుకున్నాం. థియేటర్స్ అయితే అప్పుడే ఓపెన్ చేయాలంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి కదా.. ప్రస్తుతానికైతే షూటింగ్స్.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల గురించి చర్చించాం… ఇంకా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో అన్ని విషయాలపై నిర్ణయాలు తీసుకుంటాం’’ అన్నారు.
ఈ సమావేశంలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, సురేష్ బాబు , సి.కల్యాణ్, దిల్ రాజు, శ్యామ్ప్రసాద్ రెడ్డి, ఎస్.రాధాకృష్ణ, సుప్రియ, రవికిశోర్, కిరణ్, రాజమౌళి, వివి వినాయక్, త్రివిక్రమ్, కొరటాల శివ, ఎన్.శంకర్, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: