బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను ” మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “అర్జున్ రెడ్డి ” హిందీ రీమేక్ “కబీర్ సింగ్ ” మూవీ లో హీరోయిన్ గా నటించారు. ఆ మూవీ ఘనవిజయంతో కియారా అద్వానీ బాలీవుడ్ లో బిజీగా మారారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన “లక్ష్మీ బాంబ్ “, “ఇందూ కి జవానీ “, “షేర్ షా “,” భూల్ భులయ్యా 2″ మూవీస్ కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
కియారా అద్వానీ మాట్లాడుతూ .. కరోనా వైరస్ కారణంగా ప్రపంచమే స్తంభించి పోతుందని ఎవరూ ఊహించలేదని, తాను హోమ్ పర్సన్ అని , లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయ్యాననే ఫీలింగ్ లేదని కానీ సెట్స్ కు వెళ్ళడం మిస్ అయ్యానని, లాక్ డౌన్ పీరియడ్ లో నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటున్నానని, ఉర్దూ డిక్షన్ పాలిష్ చేసుకుంటున్నానని, తన ఫ్రెండ్స్ తో టచ్ లో ఉన్నానని, ప్రతి రోజూ లూడో గేమ్ ఆడుతున్నానని, కరోనా కారణంగా మానవ సంబంధాలు పెరిగాయని, ప్రజలంతా ఒక్కటే అనే భావన అందరిలో కలిగిందని, సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత థియేటర్ లో ఒక మూవీ చూసి ఎంజాయ్ చేస్తానని కియారా అద్వానీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: