నందమూరి బాలకృష్ణ పైకి కాస్త గంభీరంగా.. కోపిష్టిగా కనపడినా ఆయన గురించి సినీ ఇండస్ట్రీలో ఎవర్ని అడిగినా మాత్రం చాలా మంచివారని.. చిన్న పిల్లల మనస్తత్వం అని చెపుతుంటారు. ఇక ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ కూడా అదే చెబుతుంది. ఆమె ఎవరో కాదు ఛార్మి. హీరోయిన్ గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఛార్మి.. తన కెరీర్లో ఎక్కువ విజయాలను సొంతం చేసుకోలేక పోయిందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం నటనకు దూరంగా వుంటూ.. పూరీ జగన్నాథ్ తో కలిసి చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది. ఇటీవలే రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ కొట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడిన ఆమెతో ఓ అభిమాని బాలకృష్ణ గురించి అడగగా.. ఆమె బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ప్రశంసించారు. బాలయ్య ఎంతో పాజిటివ్ గా ఉండే వ్యక్తి అని చెప్పారు. బాలకృష్ణ, పూరీ జగన్నాథ్ మధ్య మంచి అనుబంధం ఉందని తెలిపారు. బాలకృష్ణతో సినిమా అంటే కథకు ప్రాధాన్యత ఉంటుందని, ఆయనతో సినిమాకు పూరీ ఎప్పుడూ రెడీ అని వ్యాఖ్యానించారు. స్క్రిప్టు కుదిరితే ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని చెప్పారు. ఇన్ స్టాగ్రామ్ లైవ్ సందర్భంగా చార్మి ఈ వివరాలు తెలిపారు.
ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: