మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో హరీశ్ శంకర్ ‘గద్దలకొండ గణేశ్’ సినిమా 14 రీల్స్ సంస్థ హరీశ్ తో మరో సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక లాక్ డౌన్ అనంతరం, పరిస్థితులన్నీ సర్దుకున్న తర్వాత పూర్తి వివరాలను ప్రకటిస్తామని తెలిపారు. మరి అలా ప్రకటించారో లేదో అప్పుడే రూమర్స్ స్టార్ట్ అయిపోయాయి. ఈ సినిమాపై స్టార్ట్ అయిన రూమర్ ఏంటంటే.. ఈ సినిమా మల్టీ స్టారర్ అని. అంతేకాదు ఇద్దరు యంగ్ హీరోలు ఈ సినిమాలో నటించనున్నట్టు వారి పేర్లు చెప్పేసుకుంటున్నారు. ఇంతకీ ఆ యంగ్ హీరోలు ఎవరనుకుంటున్నారు. ఇంకెవరూ నితిన్, సాయి తేజ్. అంతేకాదు నితిన్ ఆల్రెడీ హీరోగా ఖరారైనట్లు.. మరో హీరో పాత్ర కోసం సాయి తేజ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా టాక్స్ వినిపిస్తున్నాయి. హరీష్ శంకర్ చాలా కాలంగా ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నాడు. గతంలో నితిన్, శర్వానంద్ లతో చర్చలు కూడా జరిగాయి. కానీ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. సో ఈ కారణంగా ఈ వార్తలు పుంజుకున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా వున్నాడు. మూవీ స్క్రిప్ట్ వర్క్, మ్యూజిక్ వర్క్ కొనసాగుతున్నాయని రీసెంట్ గా చెప్పిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాకు… దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: