బ్లాక్ బస్టర్ “రంగస్థలం “మూవీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో “పుష్ప” మూవీ రూపొందుతుంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై రూపొందుతున్న “పుష్ప” మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. “పుష్ప ” మూవీలో యాక్షన్ సీన్స్ హై లైట్ గా ఉంటాయని సమాచారం .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా కారణంగా విదేశీ లొకేషన్స్ లో షూటింగ్ ప్లాన్ చేసిన నిర్మాతలు , ప్రస్తుత పరిస్థితులలో సాధ్యపడక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న “పుష్ప” మూవీ షూటింగ్ ను బ్యాంకాక్, కేరళ అడవుల్లో ప్లాన్ చేశారు. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా లోని రంప చోడవరం అడవుల్లో “పుష్ప” మూవీ షూటింగ్ జరపాలనుకొంటున్నారు. నిర్మాతలలో ఒకరైన రవి శంకర్ మాట్లాడుతూ .. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో అనుకున్న లొకేషన్స్ లో షూటింగ్ సాధ్యపడదని, అడవిప్రాంతంలో చిత్రీకరణ జరపాలికాబట్టి చిత్తూరు, వికారాబాద్ అడవుల్లో చిత్రీకరణ జరుపుతామని, కొంత భాగం కేరళలో జరిపే అవకాశం ఉందని, తమ బ్యానర్ పై నిర్మించే సినిమాలలో ఫారిన్ లొకేషన్స్ ఉంటే తరువాత ఆలోచిస్తామని చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: