ముగ్గురు నాయికలతో రవితేజ సందడి

Mass Maharaja Ravi Teja New Movie To Feature Three Heroines

ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘డిస్కో రాజా’లో ముగ్గురు కథానాయికలతో సందడి చేశాడు మాస్ మహరాజా రవితేజ. కట్ చేస్తే.. త్వరలో మరో సినిమా కోసం ఇదే బాటలో వెళ్లనున్నాడట ఈ టాలెంటెడ్ స్టార్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే.. ‘వీర’ (2011) తరువాత దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్‌లో రవితేజ ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే ఒక కథానాయికగా ‘ఇస్మార్ట్’ బ్యూటీ నిధి అగర్వాల్ ఎంపికయింది. అలాగే మరో హీరోయిన్‌గా నభా నటేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అంతేకాదు.. ఇందులో ఓ ప్రత్యేక గీతం కూడా ఉంటుందని.. ఆ పాట కోసం మరో క్రేజీ హీరోయిన్ మెరిసే అవకాశం ఉందని వినికిడి.

మరి.. ముగ్గురు నాయికలతో రవితేజ చేయనున్న సందడి.. ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే.. రవితేజ తాజా చిత్రం ‘క్రాక్’ చిత్రీకరణ తుదిదశలో ఉంది. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ కాప్ డ్రామాలో శ్రుతి హాసన్ నాయికగా నటిస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =