2018 పంద్రాగస్టుకి విడుదలైన ‘గీత గోవిందం’తో కెరీర్ బెస్ట్ హిట్ను అందుకున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్. కాగా, తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో చేయబోతున్నాడు. లాక్ డౌన్ పిరియడ్ అనంతరం ఈ సినిమా పట్టాలెక్కనుంది. అలాగే, యువసామ్రాట్ నాగచైతన్యతోనూ ‘నాగేశ్వరరావు’ పేరుతో ఓ సినిమా చేయబోతున్నాడు పరశురామ్. మహేష్ సినిమా పూర్తయ్యాక చైతు సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. లాక్ డౌన్ పిరియడ్లో ఈ రెండు స్క్రిప్టులతో పాటు ఓ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టును కూడా రెడీ చేసుకున్నాడు పరశురామ్. ఓ మంచి పాయింట్ తట్టిందని, దాన్ని కంప్లీట్ స్క్రిప్ట్ గా మలిచానని ఇటీవల ఓ ప్రముఖ వెబ్ సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించాడు పరశురామ్. సమీప భవిష్యత్తులో ఈ సినిమా తెరకెక్కకపోయినా ఎప్పటికైనా ఈ సబ్జెక్టుతో సినిమా చేస్తానని పరశురామ్ చెప్పుకొచ్చాడు.
మరి.. పరశురామ్ ఫీమేల్ సెంట్రిక్ మూవీలో ఏ కథానాయికకి నటించే అవకాశం దక్కుతుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: