“మనసు మమత”(1990) మూవీ తో టాలీవుడ్ కు సంగీత దర్శకుడిగా పరిచయం అయిన కీరవాణి 3 దశాబ్దాలుగా తెలుగు, తమిళ , కన్నడ , మలయాళ, హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందించారు. గాయకుడిగా పలు హిట్ సాంగ్స్ ఆలపించారు. బ్లాక్ బస్టర్ “అన్నమయ్య ” మూవీ కి అద్భుతమైన సంగీతం అందించి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి నేషనల్ అవార్డ్ అందుకున్నారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా 11 నంది, 8ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్న కీరవాణి పలు ఇంటర్వూస్ లో త్వరలోనే రిటైర్ అవుతానని అభిమానులకు షాకిచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “బాహుబలి 2” కీరవాణి ఆఖరి చిత్రమని అభిమానులు భావించారు. ఇప్పుడు కీరవాణి మరోసారి రిటైర్ మెంట్ ఆలోచన చేస్తున్నారని, యువ సంగీత దర్శకులను ప్రోత్సహించాలని అనుకుంటున్నట్టు సమాచారం. కీరవాణి తనయుడు సింగర్ కా లభైరవ సక్సెస్ ఫుల్ “మత్తు వదలరా” మూవీ తో సంగీత దర్శకుడిగా మారారు. కీరవాణి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం “మూవీ కి సంగీతం అందించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: