బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ప్రధాన పాత్రలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పరిస్థితి తెలిసిందే. కరోనా రావడం.. లాక్ డౌన్ విధించడం. థియేటర్స్ మూత పడటం… ఇలా వెంటనే జరిగిపోయాయి. ఇక దీనివల్ల రిలీజ్ కావాల్సిన సినిమా కాస్త ఆగిపోయింది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ తీసేసిన తర్వాత దసరా పండుగకి ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్ దర్శక నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరోపక్క లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన చాలా సినిమాలు దసరా సీజన్ పైనే దృష్టి పెట్టాయి. అందువలన అఖిల్ సినిమాకి గట్టి పోటీ ఉంటుందేమో అని కూడా ఆలోచిస్తున్నారట. పైగా ఆ పోటీ వాతావరణంలో థియేటర్స్ కూడా దొరకడం కష్టమేనని అంటున్నారు. మరి చూద్దాం పోటీ అయినా పర్లేదు అని రిలీజ్ చేస్తారా ? లేక మళ్ళీ వాయిదా వేస్తారా.. ?
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. మరి చూద్దాం ఈ సినిమాతో అయినా అఖిల్ మంచి బ్లాక్ బస్టర్ అందుకుంటాడో..? లేదో..?
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: